న్యూజిలాండ్ నరమేధంలో ఐదుగురు భారతీయులు మృతి..!!!

న్యూజిలాండ్ లోని మసీదుల్లో జరిగిన్ కాల్పుల ఘటన యావత్ ప్రపంచాన్ని కదిలించింది.అత్యంత పాశవికంగా జరిగిన ఈ నరమేధంలో మృతి చెందిన వారిలో ఐదుగురు భారతీయులు ఉండటం భారత్ ని మరింత భాదించిన అంశం.

 Terror Attack At New Zealand Mosques-TeluguStop.com

మహబూబ్‌ ఖోఖర్‌, రమీజ్‌ వోరా, ఆసీఫ్‌ వోరా, హన్సీఫ్‌ అలిబవ, ఓజైర్‌ ఖాదీర్‌ అనే భారతీయులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.భారత హై కమిషన్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఇదిలాఉంటే భాదిత కుటుంభాలకి వీసా జారీ కోసం ఆన్లైన్ లో ప్రత్యేక వెబ్సైటు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు అధికారులు.అయితే మసీదులో ఈ నరమేధం జరగడానికి ముందు తొమ్మిది నిమిషాలలో తన కార్యాలయానికి సమాచారం అందిందని ప్రధాని జసిండా అర్డెర్న్‌ వెల్లడించారు.

అంతేకాదు ఆమెతో పాటు మరొక 30 మందికి కూడా ఈ సమాచారం దుండగులు అందించినట్టుగా తెలుస్తోందని అన్నారు.దుండగుడు దాడిని ఫేస్‌బుక్‌ ద్వారా ప్రత్యక్షప్రసారం చేయడంతో ఒక్క సారిగా ఆందోళన రేగింది.అయితే ఈ విషయంపై వివరణ ఇవ్వాలని ప్రధాని జసిండా ఫేస్‌బుక్‌ ఉన్నతాధికారులను కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube