ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసి రోజుకి మూడు సభలు నిర్వహిస్తూ అన్ని జిల్లాలని కవర్ చేసి వీలైనంత వేగంగా ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసి ఇక నియోజక వర్గాల అభ్యర్ధులని సమన్వయం చేస్తూ వారితో ప్రచారాన్ని నడిపించాలనే లక్ష్యంతో ఉన్నాయి.ఇందులో భాగంగా ఇప్పటికే ఉత్తరాంద్ర మూడు జిల్లాల పర్యటనలని వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పూర్తి చేసేసారు.
నిన్న జరిగిన ప్రచారంలో ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో రెండు పార్టీల నేతలు ప్రజలని ఆకర్షించే ప్రయత్నం చేసారు.
ఇదిలా ఉంటే ఈ రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా చంద్రబాబు ఒంగోలులో పర్యటించనున్నారు.
అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు.అలాగే వైసీపీ అధినేత జగన్ అనంతపురంలో ప్రచారం మొదలెట్టి, కర్నూలు, కడపలో సభలతో ఈ రోజు ప్రచారాన్ని పూర్తి చేస్తారు.
ఇప్పటికే వైసీపీ మొత్తం అభ్యర్ధుల జాబితాని ప్రకటించడంతో జగన్ ద్రుష్టి మొత్తం ఎన్నికల ప్రచారం మీదనే ఉంది, సర్వేల తమకి అనుకూలిస్తూ ఉండటంతో ఎ చిన్న అవకాశం వచ్చిన సద్వినియోగం చేసుకోవడానికి జగన్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.