సెంచరీ కొడుతున్న టీఆర్ఎస్! ఇక తెలంగాణలో ప్రతిపక్షం లేనట్లే

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ విపక్ష ఎమ్మెల్యేలపై సంధించిన ఆపరేషన్ ఆకర్ష్ చాలా బలంగా పని చేసింది అని చెప్పాలి.గత ఎన్నికలలో కూడా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలని తనవైపుకి లాక్కున్న కేసీఆర్ ఈ సారి కూడా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచినా ఎమ్మెల్యేలలో చాలా మందిని తన పార్టీ వైపు లాగేసుకున్తున్నారు.

 Trs Operation Aakarsh Target Finished With 100 Mlas-TeluguStop.com

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కడానికి రెడీగా ఉన్నామని స్పష్టం చేసారు.

ఇక తాజాగా ఖమ్మం జిల్లా కొత్త గూడెంకి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కూడా కారు ఎక్కడానికి రెడీ అయిపోయారు.

ఆది వారం కేసీఆర్ ని కలిసిన వనమా త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు అధికారికంగా స్పష్టం చేసారు.ఇక వనమాతో కలిసి టీఆర్ఎస్ లో చేరబోయే ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదికి చేరింది.

ప్రస్తుతం టీఆర్ఎస్ బలం 91కి ఈ తొమ్మిది మంది జత అయితే సెంచరీ కొట్టినట్లే.ఇక టీఆర్ఎస్ సెంచరీ చేస్తే.ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బలం 11 మందికి పడిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube