ప్రస్తుతం తెలుగులో మోస్ట్ కాంట్రవర్సీయల్ మూవీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని తెరకెక్కించాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ని మార్చి 22న రిలీజ్ చేస్తా అని త్వరలో కడపలో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది అని కూడా ప్రకటించేసాడు.అయితే ఊహించని విధంగా ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ బ్రేక్ వేసిందని వార్తని ఆర్జీవి బయట పెట్టి సినిమా రిలీజ్ పై కోర్ట్ కి వెళ్తా అని స్పష్టం చేసాడు.
ఇక సెన్సార్ బోర్డ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి అడ్డుపెట్టడంపై మీడియా ముందుకి కూడా రావడానికి ఆర్జీవి సిద్ధం అయ్యాడు.అయితే ఊహించని విధంగా ఈ ప్రెస్ మీట్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు.
అదే టైంలో తమ ఆఫీస్ సెన్సార్ బోర్డ్ పంపించిన లేఖని తప్పుగా అర్ధం చేసుకుందని, ప్రస్తుతం వారితో తమకు ఎలాంటి సమస్య లేదని, సెన్సార్ బోర్డ్ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ కి క్లియరన్స్ రాబోతుంది అంటూ ట్వీట్ చేసారు.దీంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ పై కమ్ముకున్న నీలి నీడలు వీదిపోయాయి.