ఏపీలో ఎన్నికల సమీరంలో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీలు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో పాటు, మరో వైపు ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని స్పీడ్ అప్ చేసాయి.
అయితే జనసేన పార్టీ ఎన్నికల కార్యాచరణలో వ్యూహాత్మకంగా వెళ్తున్నారా లేక నిర్లిప్తంగా ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది.కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేస్తామని చెప్పిన ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటు చేసుకోలేదు.
తాజాగా ఆదివారం రాత్రి జనసేన, కమ్యూనిస్ట్ పార్టీల పొత్తు సీట్ల పంపకాలపై ఒక క్లారిటీ ఇచ్చింది.జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకి తలో ఏడు అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంట్ సీట్లు కేటాయించారు.
ఇక వాటికోసం అభ్యర్ధులని ఎంపిక చేసుకునే పనిలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి.మరో వైపు ఎన్నికల ముందు పార్టీలో కీలక నేతలు చేరికతో ఆ పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుంది.