టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్ము దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన సినిమా విజయ్ దేవరకొండ.వరుస హిట్స్ తో మంచి జోష్ లో ఉన్న విజయ్ నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ గా డియర్ కామ్రేడ్ ఉంది.
స్టూడెంట్ యూనియన్స్ నేపధ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో విజయ్ కి జోడీగా రష్మిక మందన మరోసారి నటిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ ని చిత్ర నిర్మాతలు రిలీజ్ చేసారు.
ఇదిలా మొదటి సారి ఓ తెలుగు సినిమాని ఏక కాలంలో నాలుగు భాషలలో రిలీజ్ చేయబోతున్నారు.ఇక టీజర్ ని కూడా తాజాగా నాలుగు భాషలలో ఏకకాలంలో రిలీజ్ చేసారు.
ఓ వైపు స్టూడెంట్ వార్స్, మరో వైపు విజయ్, రష్మిక రొమాన్స్ తో డియర్ కామ్రేడ్ సినిమా టీజర్ ని దర్శకుడు భరత్ కమ్ము ప్రేక్షకులకి అందించి సినిమాపై ఆసక్తి పెంచాడు.దీంతో సినిమా మీద కూడా అంచనాలు పెరిగాయి.
ఇక మే 31న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తాజాగా ప్రకటించారు.