మెగా హీరో ఇమేజ్ బానే ఉన్నా కూడా అరడజనుకు పైగా సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.అయినా కూడా తేజూ క్రేజ్ తగ్గడం లేదు.
మెగా మేనల్లుడు అవ్వడం వల్ల మనోడికి మంచి డిమాండ్ ఉంది.తాజాగా ఈయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ అనే చిత్రాన్ని చేశాడు.
ఈ చిత్రంపై అంచనాలు పీక్స్లో ఉన్నాయి.అందుకే ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో మరియు ఇతర రైట్స్ ద్వారా దాదాపుగా 25 కోట్ల బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.కేవలం 15 కోట్ల రూపాయలతో ఈ చిత్రంను నిర్మాత నిర్మించడం జరిగింది.
15 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రానికి ఏకంగా 25 కోట్ల బిజినెస్ అవ్వడం అనేది మెగా ఫ్యాన్స్కు కూడా ఆశ్చర్యంగా ఉంది.వరుసగా ఫ్లాప్లు వచ్చిన ఏ హీరో మూవీ అయినా కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ఆసక్తి చూపించరు.కాని ఈ చిత్రాన్ని మాత్రం కొనుగోలు చేసేందుకు నిర్మాతలు మరియు బయ్యర్లు తెగ ఆసక్తి చూపించారు.
కారణం దర్శకుడు కిషోర్ తిరుమల.ఈయన దర్శకత్వంలో వచ్చిన గత చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
తాజాగా విడుదలైన టీజర్ కూడా ఆట్టుకుంది.అందుకే ఈ స్థాయిలో బిజినెస్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.
నైజాం ఏరియాలో 3 కోట్లు, సీడెడ్లో 1.7 కోట్లు, కర్ణాటక 70 లక్షలు, ఆంధ్రా మొత్తం 5 కోట్లు.మొత్తంగా అన్ని ఏరియాల థియేట్రికల్ రైట్స్ ద్వారా 11 కోట్ల మేరకు సినిమా రాబట్టింది.ఇక డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ప్రైమ్ వీడియో రైట్స్ ఇలా ఇతర రైట్స్ కలిపి మొత్తంగా 14 కోట్లను రాబట్టినట్లుగా సమాచారం అందుతోంది.
సాయి ధరమ్ తేజ్పై ఈస్థాయిలో అంచనాలు పెట్టుకున్నందుకు మరి నిలబెట్టుకుంటాడా, ఈ సినిమా సక్సెస్ అయ్యేనా అనేది చూడాలి.ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.