ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది వైసీపీలో చేరే అశావాహుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది.వైసీపీ అధినేత జగన్ సమక్షంలో సీనియర్ నాయకుల చేరికలు ఓ వైపు టీడీపీని టెన్సన్ పెడుతూ ఉంటే మరో వైపు వైసీపీ పార్టీకి కొత్త ఉత్సాహం ఇస్తుంది.
కాంగ్రెస్, బీజేపీతో రాజకీయ భవిష్యత్తు లేదని, టీడీపీకి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావిస్తున్న అందరూ వైసీపీ గూటికి చేరుతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ అధినేత సమక్షంలో కీలక నేతలైన వంగా గీత, కొణతాల రామకృష్ణ, ఆదాల ప్రభాకర్ కండువా కప్పుకున్నారు.
వైసీపీ పార్టీ నుంచి వీరికి టికెట్స్ విషయంలో స్పష్టమైన హామీ వచ్చిన మీదట వీరంతా పార్టీలో చేరడానికి సిద్ధం అవుతున్నారు.ఇక వైజాగ్ కి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణం రాజు శ్రీనివాస్ కూడా పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ రోజు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాల్సిన జగన్ తన బాబాయ్ మృతి కారణంగా వాయిదా వేసుకొని రేపటి నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు.అలాగే వైసీపీ అభ్యర్ధులని కూడా రేపు ఇడుపులపాయలోనే ప్రకటించడానికి రెడీ అవుతున్నారు.
.