రఘు కర్నాడ్ ప్రముఖ జరలిస్ట్ గా, రచయితగా సుపరిచతమైన వ్యక్తే.ఆయన తన మొదటి పుస్తకంతోనే రికార్డ్ క్రియేట్ చేశారు.
ఆయన రాసిన “ద ఫార్తెస్ట్ ఫీల్డ్” – యాన్ ఇండియన్ స్టోరీ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్’ పుస్తకానికి ప్రఖ్యాత విండ్హామ్-కాంప్బెల్ పురస్కారం లభించింది.
ఒక్క పురస్కారం మాత్రమే కాదు దాంతో పాటు రూ.కోటిపైగా బహుమతి కూడా దక్కింది.ఈ విషయాన్ని లండన్లో జరిగిన ఓ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో తెలిపారు.
అమెరికాలోని యేల్ యూనివర్సిటీ సహకారంతో అందచేసిన ఈ పురస్కారానికి అంతర్జాతయంగా చాలా ప్రాధాన్యత దక్కింది.
అయితే ఈ అరుదైన గౌరవం దక్కిన రెండవ భారతీయుడిగా రఘు రికార్డ్ క్రియేట్ చేశారు.భారతీయ వర్ధమాన రచయితల్లో రఘు శైలి చాలా కొత్తగా ఉందని కితాబు ఇస్తున్నారు.ఇదిలాఉంటే ఈ విషయంపై హార్పర్కోలిన్స్ ఇండియా పబ్లికేషన్స్కు చెందిన ఎడిటర్ స్పందిస్తూ ఈ అవార్డ్ రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
తాజా వార్తలు