కర్నూలు మంత్రాలయం నియోజక వర్గంలో టీడీపీ, వైసీపీ పార్టీలు నిర్వహిస్తున్న పోటాపోటీ ఎన్నికల ప్రచారంలో ఇక్కసారిగా ఫ్యాక్షన్ కక్షలు పురి విప్పాయి.ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కగ్గళ్లు గ్రామానికి వెళ్ళిన తిక్కారెడ్డిపై ఆయన ప్రత్యర్ధి వైసీపీ నేత బాల నాగిరెడ్డి అనుచరులు ఒక్కసారిగా వేట కొడవళ్ళతో దాడికి ప్రయత్నించారు.
అయితే ప్రచారంలో తిక్కా నాగిరెడ్డికి సెక్యూరిటీగా ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని గాల్లోకి కాల్పులు జరపడంతో ఇరు వర్గాలు చెల్లాచెదురయ్యాయి.
ఇక ఈ గొడవలపై బాల నాగిరెడ్డి అనుచరుల దాడిలో టీడీపీ అభ్యర్ధి తిక్కా నాగిరెడ్డికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది.
అలాగే కొంత మంది పోలీసులు కూడా గాయపడ్డారని సమాచారం.ఇక ఇరు వర్గాల ఘర్షణ నేపధ్యంలో కగ్గళ్లు గ్రామలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.దీనిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం కర్నూలు పోలీసులు చేసారు.ఇక తిక్కారెడ్డిని పోలీసులు అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు.