రేపు విశాఖ ఎన్నికల ప్రచారంలోనే వైసీపీ అభ్యర్ధుల ప్రకటన

ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ ఎన్నికల ప్రచారానికి తెరతీసాయి.ఈ రోజు తిరుపతి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంకి శ్రీకారం చుడుతూ ఉండగా.

 Jagan Will Be Announce First List Of Mla Candidates In Vizag Tour-TeluguStop.com

వైసీపీ అధినేత జగన్ కూడా ఈ రోజే ఎన్నికల ప్రచారం ప్రారంభించాల్సి ఉంది.అయితే జగన్ బాబాయ్ మృతి కారణంగా ఈ రోజు తన ప్రచారం వాయిదా వేసుకున్నారు.

అలాగే అభ్యర్ధుల ప్రకటన కూడా వాయిదా వేసారు.ఈ రోజు వివేకానంద అంత్యక్రియల అనంతరం హైదరాబాద్ వెళ్లి గవర్నర్ ని కలిసిన అనంతరం జగన్ తన ఎన్నికల కార్యాచరణ మొదలుపెడుతున్నారు.

ఇక రేపు విశాఖలో బహిరంగ సభ ద్వారా తన ఎన్నికల ప్రచారంని పూర్తి స్థాయిలో మొదలుపెట్టనున్న జగన్ అదే సమయంలో వైసీపీ అభ్యర్ధుల మొదటి జాబితాని ప్రకటించడానికి సిద్ధం అవుతున్నారు.ఇప్పటికే మొదటి జాబితాలో మెజారిటీ అభ్యర్ధుల లిస్టు తయారైంది.

వారికి కూడా సమాచారం పంపించడం జరిగిందని తెలుస్తుంది.అయితే అధికారికంగా రేపు ఉదయం 11 గంటలకి వైసీపీ అభ్యర్ధుల జాబితాని ప్రకటించనున్నారని తెలుస్తుంది.

అదే టైంలో వైసీపీ పార్టీ మేనిఫెస్టో కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube