అప్పుల బాధలు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.ఇప్పటికే అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కథలు చాలా విన్నాం.
చూసాం కూడా.ఇప్పుడు అలాంటి ఘటన ప్రకాశం జిల్లాలో కొమరవోలు మండలం అలీ నగరంలో చోటు చేసుకుంది.
అప్పుల బాధ తాలకేలక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
ఒకే సారి కుటుంబ సభ్యులు అందరూ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలో సంచలనంగా మారింది.
ఇక ఆత్మహత్య చేసుకున్న వారు రాఘవేంద్ర, ఈశ్వరమ్మ, వైష్ణవి, వరలక్ష్మిగా గుర్తించారు.ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలంలోకి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తుని మొదలెట్టారు.
వీళ్ళు ఆత్మహత్య వెనుక కేవలం అప్పులబాదనే వుందా లేక ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ మొదలెట్టారు.