నేడు వైఎస్ వివేకానంద రెడ్డి అంత్యక్రియలు! వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ఆందోళన

వైసీపీ అధినేత జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఇప్పుడు సిట్ వేగవంతం చేసింది.ఇప్పటికే ఈ మరణం రాజకీయంగా సంచలనంగా మారడంతో పాటు ఈ మరణం వెనుక మీరున్నారంటే మీరు ఉన్నారు అంటే ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు.

 Ys Vivekananda Cremation In Today1-TeluguStop.com

ఎన్నడూ చూడని విధంగా మొదటి సారి ఏపీ హత్య రాజకీయాలకి కేంద్ర బిందువుగా మారింది.ఇదిలా ఉంటే నిన్న ఉదయం మరణించిన వివేకానంద రెడ్డి అంత్యక్రియలు ఈ రోజు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు రెడీ అవుతున్నారు.

ఇక వైఎస్ వివేకానంద హత్యా ఘటన వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించిన జగన్ ఈ రోజు దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి పిలుపునిచ్చారు.రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ శ్రేణులు ఈ రోజు శాంతియుత ఆందోళన చేసి గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పారు.

ఇక వివేకానంద అంత్యక్రియల అనంతరం వైసీపీ అధినేత జగన్ గవర్నర్ కి కలిసి ఈ హత్యపై సిబిఐ విచారణ కోరడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.మరి ఈ హత్య ఉదంతం రాజకీయంగా ఏపీలో ఎలాంటి మార్పులకి కారణం అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube