తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కసరత్తుని ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్ మొదలెట్టాయి.ఇక తెలంగాణ అన్ని ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తూ ఉండగా ఈ సారి ఎలా అయిన పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చాటడం ద్వారా కాంగ్రెస్ బలం నిరూపించుకోవాలని భావిస్తున్నారు.
అయితే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కి బలపడే అవకాశం ఇవ్వకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచినా వారిన తన పార్టీలోకి లాక్కుంటుంది.
ఇదిలా ఉంటె తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ బరిలో పోటీ పడే అభ్యర్ధుల మొదటి జాబితాని ప్రకటించింది.9 అభ్యర్ధులతో కూడిన ఈ మొదటి జాబితాలో సీనియర్స్ కి పెద్ద పీట వేసారు.అలాగే కాంగ్రెస్ పార్టీ తరుపున మల్కాజ్ గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి అవకాశం సొంతం చేసుకున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ ని గట్తిగా ఎదుర్కొనే సత్తా ఉన్న రేవంత్ రెడ్డిని పార్టీ తరుపున బరిలో దింపితే కాంగ్రెస్ పార్టీని నడిపించగలడని భావించి రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.