వందేళ్ళ చరిత్ర కలిగిన బోయింగ్ విమానయాన సర్వీస్ లకి ప్రపంచ దేశాలు ముగింపు పలుకుతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తుంది.ఆధునిక టెక్నాలజీకి భిన్నంగా బోయింగ్ తన పాత టెక్నాలజీతోనే ప్రయానికుల విమానాలు తయారు చేస్తూ రన్ వేపైకి వాడులుతున్నాయి.
రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా ఉపయోగించిన బోయింగ్ విమానాలకి కాలం చెల్లిపోయింది అని భావిస్తున్న ప్రపంచ దేశాలు వాటిని నిషేధించే దిశగా అడుగులు వేస్తున్నాయి.దీనికి కారణం ఈ మధ్య కాలంగా తరుచుగా జరుగుతున్న ప్రమాదాలు అని తెలుస్తుంది.
ఎన్నేళ్ళ చరిత్ర వున్న ఏదో ఒక సందర్భంలో మూలకి చేరాల్సిందే.అనే విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు బోయింగ్ విమానాల పరిస్థితి అదే అయ్యింది.సుదూరంగా ప్రయాణికులని తీసుకెళ్ళే సామర్ధ్యం వున్న ఏవి ఈ మధ్యకాలంలో తరుచుగా సాంకేతిక సమస్యలతో ప్రమాదాలకి గురవుతున్నాయి.
దీంతో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.తాజాగా ఇథియోపియాకి చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానం ప్రమాదానికి గురై 157 మంది ప్రయాణికులు చనిపోయిన సంగతి తెలిసిందే.
దీంతో ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు బోయింగ్ పై నిషేధం విధించాయి.తాజాగా భారత్ కూడా బోయింగ్ సర్వీస్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ విషయాన్ని ఏవియేషన్ శాఖ కీలక ప్రకటన చేసింది.