గుజరాత్ లో పటేల్ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ బీజేపీ పార్టీకి, మోడీకి వ్యతిరేకంగా ఆ వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్.చిన్న వయసులోనే తన ప్రసంగాలతో పటేల్ సామాజిక వర్గంని తనవైపు తిప్పుకొని లక్షల సంఖ్యలో ప్రజల మద్దతుని సొంతం చేసుకున్నాడు.
ఇక బీజేపీ పార్టీని గుజరాత్ లో గద్దె దించడమే లక్ష్యంగా హార్దిక్ పటేల్ చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాడు.అయితే గుజరాత్ అభివృద్ధి మళ్ళీ బీజేపీ వైపే ప్రజలు ముగ్గు చూపేలా చేస్తుంది.
ఇదిలా వుంటే పటేల్ సామాజిక వర్గం ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది.మార్చి 12న అతను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది.
కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ తనకి అప్పగించిన బాధ్యతలని నిర్వహిస్తా అని ఇప్పటికే స్పష్టం చేసిన అతను ఎన్నికలలో పోటీ విషయంలో కూడా రాహుల్ గాంధీ నిర్ణయంకి కట్టుబడి ఉంటా అని తెలియజేసారు.ఇక గుజరాత్ లో అంతంత మాత్రంగా వున్న కాంగ్రెస్ పార్టీ, హార్దిక్ పటేల్ చేరిక వలన బలపడే అవకాశం వుందని తెలుస్తుంది.