దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది.పార్లమెంట్ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ను ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది.
మార్చి 18 నుంచి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ ప్రారంభమవుతుందని ఎన్నికల కమిషన్ మీడియా సమావేశంలో లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారి సునీల్ ఆరోరా తెలియజేశారు.ఇక ఇక ఎన్నికల నోటిఫికేషన్ మొదలైనప్పటి నుంచి పార్టీల ప్రచారంపై ఎన్నికల సంఘం దృష్టి పెడుతుందని తెలియజేశారు.
సోషల్ మీడియా పైన కూడా ఎన్నికల సంఘం నిఘా పెట్టిందని ఎన్నికల నియమావళిని అతిక్రమించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సునీల్ అరోరా మీడియా సమావేశంలో తెలియజేశారు.
ఇక దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని, మొదటి విడత ఎన్నికల పోలింగ్ 11న మొదటి విడత ఎన్నికలు జరుగుతాయని తెలియజేశారు.
ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా అ మొదటి విడత లో భాగంగానే జరగనున్నట్లు తెలిపారు.మొత్తం ఏడు వేడుకల్లో జరిగే పోలింగ్ ఒకే విధంగా జరుగుతుందని, ఎన్నికలకు 5 రోజులు ముందు ఓటర్ల స్లిప్పులు పంపిణీ చేయడం జరుగుతుందని ఎన్నికల సంఘం అధికారి తెలియజేశారు.
ఇక తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని కూడా స్పష్టం చేశారు.