డేటా చోరీకి ముందుగా టీఆర్ఎస్ పార్టీ పాల్పడింది! హీరో శివాజీ!

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో డేటా చోరీ వివాదం రాజకీయాలలో సంచలనంగా మారింది.డేటా చోరీ మాటున ప్రజల ఓట్లు తొలగించారని ఆరోపణలతో రాజకీయ పార్టీలు అన్ని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

 Hero Shivaji Show Up Secrets On Data Theft Case-TeluguStop.com

మరో వైపు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు డేటా చోరీ వ్యవహారంపై సిట్ లు వేసి విచారణ మొదలెట్టాయి.మరో వైపు ఎన్నికల సంఘం కూడా ఫారం 7 ద్వారా ఓట్ల తొలగింపులో జరిగిన అక్రమాలు వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ డేటా చోరీ వ్యవహారంపై హీరో శివాజీ మీడియా ముందుకి వచ్చాడు.ఈ డేటా చోరీ వ్యవహారం ముందుగా దేశంలో తెలంగాణ సర్కార్ మొదలెట్టింది అని తెలియజేసారు.

సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ప్రజల డేటాని తీసుకొన్న టీఆర్ఎస్ సర్కార్ ఎన్నికల కమిషన్ దగ్గర వున్నా ఓటర్ల లిస్టు లో టాలి చేసుకొని కొన్ని ఓట్లు తొలగించారని పేర్కొన్నారు.అలాగే నమో యాప్ ద్వారా బీజేపీ పార్టీ 90 కోట్ల ఓటర్ల డేటాని తన వ్యక్తిగతంగా వాడుకుంటుంది అని తెలుస్తుంది.

ఇప్పుడు డేటా చోరీ వ్యవహారాన్ని తెరపైకి తేవడానికి కారణం ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అంశాలని పక్కకి తప్పించడానికే అని చెప్పుకొచ్చారు.అలాగే ఇదంతా కేవలం పొలిటికల్ స్టంట్ అని శివాజీ కొట్టిపారేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube