మరో రెండు రోజుల్లో జరుగబోతున్న మూవీ ఆర్టిస్టు అసోషియేషన్(మా) ఎన్నికల వేడి తారా స్థాయికి చేరింది.గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రెసిడెంట్ క్యాండిడెట్స్ తీవ్ర స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజాకు పోటీగా సీనియర్ నటుడు నరేష్ పోటీ చేసిన విషయం తెల్సిందే.తాజాగా టీవీ కార్యక్రమాలు మరియు ప్రెస్ మీట్లలో శివాజీ రాజాపై నరేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది.
శివాజీ రాజా పెద్ద అవినీతి పరుడు, వాడు చేసిన దొంగ పనులు నాకు తెలుసు.మా నిధులను గోల్ మాల్ చేయడంతో పాటు, చాలా మోసాలకు పాల్పడ్డాడు అంటూ విమర్శించడం జరిగింది.
నరేష్ విమర్శలతో శివాజీ రాజా కన్నీరు పెట్టుకున్నాడు.మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల్లో గెలుపు కోసం నన్ను మరీ ఇంతగా విమర్శించడం ఏంటీ, నా జీవితంలో అన్ని విషయాల్లో కూడా పారదర్శకంగా ఉంటూ వచ్చాను.ప్రతి విషయంలో కూడా నేను మా కార్యవర్గంకు క్లీయర్గా చెప్పి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.అలాంటిది నన్ను మోసగాడు, అవినీతి పరుడు అంటూ తిట్టడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ శివాజీ రాజా కన్నీరు పెట్టుకున్నాడు.
ఎన్నికల ముందు శివాజీ రాజా కన్నీరు పెట్టుకున్న నేపథ్యంలో నరేష్ ప్యానల్ వారు శివాజీకి అది పాజిటివ్గా మారే అవకాశం ఉందని, శివాజీ రాజాపై నరేష్ మరీ అంతగా విమర్శలు చేయకుంటే బాగుండేది అని సొంత ప్యానల్ వారు అంటున్నారు.శివాజీ రాజాపై పాజిటివ్ కార్నర్ ఏర్పడితే ఆయన గెలుపు ఖాయం అవుతుందని ఈ సందర్బంగా కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ఆదివారం జరుగబోతున్న మా ఎన్నికలు హోరా హోరీగా సాగడం ఖాయం అని తెలుస్తుంది.ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే విషయం ఆదివారం సాయంత్రం వరకు క్లీయర్గా తెలిసే అవకాశం ఉంది.