పాకిస్తాన్ లో ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్ తర్వాత పాకిస్తాన్ కి కంటి మీద కునుకు లేకుండా పోయింది.ఓ వైపు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి, మరో వైపు భారత్ వైపు నుంచి ఎదురవుతున్న దాడులు వెరసి పాకిస్తాన్ లో మదర్సాలు మాటున జరిగే ఉగ్ర కార్యకలాపాలు నియంత్రించడానికి వాటిపై నిషేధం విధించడంతో పాటు, వాటిని నడుపుతున్న వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ చర్యల కారణంగా పాకిస్తాన్లో అక్కడి ప్రభుత్వం పై కొంత వ్యతిరేకత వస్తున్న కూడా వారికి మరో అవకాశం లేకుండా పోయింది.
ఇదిలా వుంటే భారత్ నుంచి అంతర్జాతీయ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ తప్పనిసరి పరిస్థితిలో జైషే వ్యవస్థాపకుడు మసూద్ అజార్ తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడని చెప్పుకొచ్చింది.
అయితే అందులో వాస్తవం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ ఒత్తిడికి భయపడి అలా అబద్దపు ప్రచారం చేస్తుందని, కాని తాను భాగానే వున్న అని ఓ ఆడియో మెసేజ్ రిలీజ్ చేసిన మసూద్, భారత్ పై జిహాదీ ప్రకటించి, ఆ దేశంతో యుద్ధానికి సిద్ధం కావాలని ఉగ్ర వాదులకి పిలుపునిచ్చాడు.భారత్ పై ప్రతీకారం కచ్చితంగా తీర్చుకుంటాం అని మసూద్ ఆ ఆడియో మెసేజ్ లో చెప్పడం విశేషం.