మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ త్వరలో టీడీపీ పార్టీలో చేరబోతున్నారని చాలా కాలంగా టాక్ వినిపిస్తుంది.కాంగ్రెస్ పార్టీ హయాంలో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ మంత్రివర్గంలో మంత్రిగా చేసిన కొణతాల గత ఎన్నికలలో పోటీకి దూరంగా వున్నారు.
తరువాత క్రీయాశీలక రాజకీయాలకి దూరంగా ఉంటూ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు.అయితే మళ్ళీ ఎన్నికలు దగ్గర పడటంతో కొణతాల క్రియాశీలక రాజకీయాలలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇందుకు గాను ప్రస్తుతం రాష్ట్రంలో మూడు పార్టీల బలాబలాలు పరిశీలించుకొని చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.
ఇక టీడీపీలో కొణతాల చేరిక లాంచానమే అనే మాట ఇప్పుడు వైజాగ్ లో వినిపిస్తుంది.
ఈ నెల 17న అధికారికంగా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు అని తెలుస్తుంది.ఇక రానున్న ఎన్నికలలో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి కొణతాలని ఎంపీగా బరిలో దించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
టీడీపీకి అవంతి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో ఇప్పుడు కొణతాలని దించి విజయం సొంతం చేసుకోవాలని బాబు ఎత్తుగడగా తెలుస్తుంది.మరి ఇది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది చూడాలి.