యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నటిస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం సాహో.సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మీద ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని వున్నాయి.
ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన సాహో మేకింగ్ వీడియో సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేశాయి.యాక్షన్ అడ్వంచర్ గా యూనివర్శల్ స్టాండర్డ్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇక తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే యాక్షన్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసి టాకీ పార్ట్ మీద దర్శకుడు ద్రుష్టి పెట్టాడు.
ఇదిలా వుంటే ఈ సినిమా బిజినెస్ ని చిత్ర నిర్మాతలు ఇప్పటికే మొదలెట్టినట్లు తెలుస్తుంది.ఇందులో భాగంగా తాజా గా సాహో ఓవర్సీస్ రైట్స్ ని యూవీ క్రియేషన్స్ భారీ ధరకి అమ్మింది అని టాక్ వినిపిస్తుంది.
సాహో ఓవర్సీస్ రైట్స్ ని 42 కోట్లకి ఫర్ ఫిలిం అనే సంస్థ కొనుగోలు చేసింది అని తెలుస్తుంది.గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ ఈ సినిమాని అమెరికాలో రిలీజ్ చేయనుంది.
ఒక తెలుగు సినిమా ఓవర్సీస్ రైట్స్ ఈ స్థాయిలో అమ్ముడుపోతే ఇజా తెలుగు, తమిళ, హిందీ థీయట్రికల్ రైట్స్ ఎ స్థాయిలో అమ్ముడు పోతాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.