సినీ నటి జయసుధని వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాలలోకి తీసుకొచ్చి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఆమెని బరిలో నిలిపారు.ఇక అక్కడి నుంచి తన రాజకీయ ప్రస్తానం కాంగ్రెస్ పార్టీతో మొదలెట్టిన జయసుధ, గత ఎన్నికల వరకు ఆ పార్టీలోనే వున్నారు.
అయితే రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో చేరిన ఆమె క్రియాశీలక రాజకీయాలకి దూరంగా వున్నారు.
ఇదిలా వుంటే తాజాగా జయసుధ చంద్రబాబుకి షాక్ ఇస్తూ టీడీపీ పార్టీకి రాజీనామా చేసారు.
ఇక ఈ రోజు సాయంత్రం జగన్ సమక్షంలో ఆమె వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్నారు.రానున్న ఎన్నికలలో క్రియాశీలకంగా ఏపీ రాజకీయాలలో భాగం కావాలని భావించి ఆమె వైసీపీ పార్టీని వేదికగా ఎంచుకున్నట్లు తెలుస్తుంది.
వైఎస్ కుటుంబంతో వున్నా అనుబంధం కొద్ది ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
.