టాలీవుడ్లో ప్రస్తుతం మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికల హడావుడి కనిపిస్తుంది.ఎప్పటి కంటే ఈసారి పోరు హోరా హోరీగా సాగే అవకాశం కనిపిస్తుంది.
గత రెండు దఫాలుగా అధ్యక్షుడిగా పని చేస్తున్న శివాజీ రాజాపై కొందరు తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు.అందుకే ఈసారి నరేష్ ప్యానల్కు ఓటు వేయాలని భావిస్తున్నారు.
అయితే కొందరు మాత్రం శివాజీ రాజాకు మద్దతుగానే ఉన్నారు.శివాజీ రాజాపై వ్యతిరేకత ఎక్కువ ఉండటానికి ప్రధాన కారణం శ్రీరెడ్డి ఇష్యూ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
సినీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం శ్రీరెడ్డి ఇష్యూ వల్లే ఈసారి మా ఎన్నికలు మరింత రంజుగా మారాయి అంటున్నారు.
ఆమద్య శ్రీరెడ్డి టాలీవుడ్ ప్రముఖులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సమయంలో మా పెద్దగా స్పందించలేదు.పైగా మా నిర్వాకం వల్ల టాలీవుడ్ పరువు పోయింది.అధ్యక్షుడు శివాజీ రాజా గందరగోళ ప్రకటనలు, ఆమెను బ్యాన్ చేయడం, ఆ తర్వాత తిరిగి తీసుకోవడం వంటివి చేయడం వల్ల ఆమె మరింతగా రెచ్చి పోయింది.
మా చేసిన పని వల్ల శ్రీరెడ్డికి పబ్లిసిటీ బాగా దక్కింది.ఆమెపై కొందరు సానుభూతి చూపించారు.దాంతో మాకు వ్యతిరేకంగా ఆమె మరింతగా ఉద్యమం చేయడం మొదలు పెట్టింది.దాన్ని కూడా శివాజీ రాజా అండ్ కో అడ్డుకోవడంలో విఫలం అయ్యారు.
జీవిత రాజశేఖర్ వంటి వారిపై కూడా శ్రీరెడ్డి విమర్శలు చేసిన సమయంలో ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో పాటు శివాజీ రాజా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు.ఈ విషయాన్ని జీవిత స్వయంగా మీడియా ముందు చెప్పుకొచ్చింది.అప్పుడు తమను విమర్శిస్తుంటే ఎవరు పట్టించుకోలేదు.అసలు మా ఉందా లేదా అన్నట్లుగా వ్యవహరించారు.అందుకే ఇప్పుడు మా అధ్యక్షుడిగా కొత్త వారు ఉండాలని తాను భావిస్తున్నట్లుగా జీవిత చెప్పుకొచ్చింది.మరోసారి శ్రీరెడ్డి వంటి వారు పుట్టుకు రాకుండా ఇండస్ట్రీ వారిపై ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకోకుండా ఉండాలి అంటే మా కాస్త సీరియస్గా ఉండాలి.
అలా ఉండే అధ్యక్షుడు ఇప్పుడు కావాలి అంటూ ఎక్కువ శాతం మంది నటీనటులు అంటున్నారు.మరి ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి.