తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఒకటి టెన్సన్ పెడుతూ వుంటే మరో వైపు అధికార పార్టీ టీడీపీని రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా టెన్సన్ పెడుతుంది.ఎన్నికల నోటిఫికేషన్ తరువాత మార్చి 22న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితంలో కీలక ఘట్టాలని తీసుకొని ఆర్జీవి తెరకెక్కించాడు.
ఇందులో లక్ష్మి పార్వతి పాత్రతో పాటు, చంద్రబాబు పాత్ర కూడా కీలకంగా వున్నాయి.ఇక ఇందులో చంద్రబాబుని నెగిటివ్ గా ఆర్జీవి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా చంద్రబాబు మీద బ్యాడ్ రిమార్క్ వుంది.ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ ని పదవీచ్యుతుని చేసిన ఘట్టాలని మరో సారి తెరపై చూపిస్తున్న ఆర్జీవి సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని వుంది.
ఈ నేపధ్యంలో ఇదిలా వుంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఓవర్సీస్ బిజినెస్ ని ఆర్జీవి ఇప్పటికే పూర్తి చేసేసాడు.వీకెండ్ సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అమెరికాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి రెడీ అవుతుంది.
మరి చంద్రబాబుకి వ్యతిరేకంగా వస్తున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అనేది వేచి చూడాలి.