ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్ అధికార దాహంతో కొట్టుకుంటున్నారని, దీనికోసం ఎలా అయిన ఎన్నికలలో గెలవాలని కుల, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమా విమర్శలు చేసారు.మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్ష వైసీపీ, కేసీఆర్ కనుసన్నలలో నడుచుకుంటున్నారని, తెలంగాణ ఎన్నికలలో ఓట్లు తొలగించి టీఆర్ఎస్ ఎలా అధికారంలోకి వచ్చిందో, ఇప్పుడు వైసీపీని అలాగే అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారని దయ్య బట్టారు.
అధికార వ్యామోహంతో జగన్ తన నివాసాన్ని ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం మాదిరి నిర్మించుకున్నారని, మరో వైపు అధికార పార్టీ సానుభూతిపరులకి చెందిన 8 లక్షల ఓట్లు తొలగించడానికి కుట్ర చేసినట్లు జగన్ నేరుగా ఒప్పుకున్నాడని, దీనిపై ఎన్నికల సంఘం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని దేవినేని డిమాండ్ చేసారు.వైసీపీకి అధికారం పగటికలగానే ఉంటుందని, ప్రజలు జగన్ చేసే ఘోరాలు చూస్తున్నారని, వారంతా ఎన్నికలలో గట్టిగా తిరగబడతారని దేవినేని వైసీపీ అధినేతపై విమర్శలు చేసారు.