విజయనగరం జిల్లాలో నెలిమర్ల సమీపంలో రామతీర్ధంలో శివరాత్రి వేడుకలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.శివరాత్రి నాడు రామతీర్ధం కొండపై శివాలయం వుంటుంది.
ఈ శివాలయం దర్శనం కోసం వేల సంఖ్యలో భక్తులు వెళ్తూ వుంటారు.అయితే ఈ కొండ కొద్దిగా ప్రమాదకరంగా వుంటుంది.
ఎ మాత్రం అజాగ్రత్తగా వున్న ప్రమాదానికి గురయ్యే అవకాశాలు వున్నాయి.
ఇదిలా వుంటే శివరాత్రి సందర్భంగా రామతీర్ధంలో వేడుకలకి వెళ్ళి కొండపై నుంచి జారి ఇద్దరు యువకులు మృతి చెందినట్లు తెలుస్తుంది.
దాసన్నపేటకి చెందిన ముగ్గురు యువకులు రామతీర్ధం కొండపైకి ఎక్కారు, కొండపైకి వెళ్ళే క్రమంలో ఊహించని విధంగా కొండలోయ లో జారిపడిపోయిన ముగ్గురు యువకులలో ఇద్దరు మృతి చెందగా, ఒక యువకుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
.