కాంగ్రెస్ సర్జికల్ వీరులని అవమానిస్తుంది! మోడీ తీవ్ర విమర్శలు!

దేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు, విపక్షాలు అన్ని బాలంకోట్ లో జరిగిన వైమానిక దాడులకి సంబంధించిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేస్తూ వుంటే, విపక్షాల వాఖ్యలపై అధికార పార్టీ టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది.సర్జికల్ స్ట్రైక్ చేసామని వైమానిక దళం అధిపతి చెప్పిన తర్వాత కూడా ఇంకా వాటికి ఆధారాలు చూపించాలని చెప్పడం చూస్తుంటే వారికి సైనికులపై ఎంత గౌరవం వుందో అర్ధమవుతుందని దయ్యబట్టారు.

 Modi Sensational Comments On Congress-TeluguStop.com

పుల్వామా దాడి ఓ ప్రమాదంగా దిగ్విజయ్ సింగ్ చెప్పడంపై సైనికుల త్యాగాలని వారు ఎంతగా అవమానిస్తున్నారో అర్ధం అవుతుంది అంటూ మోడీ దార్ లో జరిగిన సభలో విమర్శించారు.

ముంబైలో జరిగిన ఉగ్ర దాడితో పాక్ కి ఎలాంటి సంబంధం లేదని క్లీన్ చీట్ ఇచ్చిన ఆ వ్యక్తికి ఇంతకంటే గొప్పగా మాట్లాడుతాడని ఎవరు ఆశించలేరని, వారికి సైనికులని అవమానించి పాకిస్తాన్ ని మెప్పించడానికే ఆసక్తి చూపిస్తారని, కాని తమ ప్రభుత్వం అలా కాదని, శత్రువులు దేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా చేస్తానని, దేశాన్ని రక్షించి భారత మాత ఋణం తీర్చుకుంటా అని మోడీ సభలో తెలియజేయడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube