టీడీపీకి అనుబంధంగాగా పని చేస్తూ, ఏపీలో తెలుగు దేశం పార్టీ ప్రవేశం పెట్టి పథకాల కోసం యాప్ ని రూపొందిస్తూ, ఏపీలో ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ చేసి, ఓట్ల తొలగింపుకి పాల్పడుతుంది అని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ అనే సంస్థ మీద తెలంగాణలో సైబర్ క్రైమ్ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.దీనిపై సైబరాబాద్ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థపై విచారణ మొదలెట్టారు.
అయితే దీనిని చాలెంజ్ చేస్తూ, అలాగే ఏపీ ప్రభుత్వం కోసం పని చేస్తున్న ఐటీ సంస్థ మీద తెలంగాణ పోలీసుల విచారణ చేపట్టడం కరెక్ట్ కాదని, అలాగే ఐటీ గ్రిడ్ సంస్థకి చెందిన 5 మంది ఉద్యోగులు మిస్సింగ్ అని ఏపీ ప్రభుత్వం తరుపున హై కోర్ట్ లో పిటీషన్ చేసారు.
ఇదిలా వుంటే ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన హై కోర్ట్ ఐటీ ఉద్యోగులని విడిచిపెట్టాలని సైబరాబాద్ పోలీసులకి చెప్పడంతో పాటు, ఐటీ గ్రిడ్ పై నమోదైన కేసు విషయంలో హై కోర్ట్ జోక్యం చేసుకోదని తేల్చి చెప్పింది.
దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఊహించని విధంగా షాక్ తగిలింది అని చెప్పాలి.మరి ఐటీ గ్రిడ్ సంస్థపై నమోదైన కేసులో విచారణ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించారు అనే విషయం ఈ రోజు సాయంత్రం తెలియజేసే అవకాశం వున్నట్లు తెలుస్తుంది.