తప్పు చేయకపోతే చంద్రబాబుకి భయమెందుకు! కేటీఆర్ కౌంటర్!

ఏపీలో సేవామిత్ర యాప్ ని హ్యాండిల్ చేస్తున్న ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ ద్వారా టీడీపీకి వ్యతిరేకంగా ఉండేవారి ఓట్లు తొలగిస్తున్నారనే ఆరోపణలతో ఆ సంస్థపై తెలంగాణలో సైబర్ పోలీసులు దాడులు చేసిన ఓ ఐదు మంది ఉద్యోగులని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.అయితే దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి, తెలంగాణ సర్కార్ తమపైన దాడి చేస్తుందని, ఏపీ ప్రభుత్వం కోసం పని చేసే ఐటీ కంపెనీ డేటా చోరీ చేసి అక్రమాలకి పాల్పడే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు అందుకుంది.

 Ktr Counter Attack To Chandrababu-TeluguStop.com

దీనికి వైసీపీ తొత్తులా మారి సహకరిస్తుందని ఆరోపణలు చేసారు.అదే సమయంలో హై కోర్ట్ లో హెబియర్ కార్పస్ పిటీషన్ కూడా వేయించారు.

ఇదిలా వుంటే ఆ పిటీషన్ పై సైబర్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐదు మందికి కోర్ట్ ముందు హాజరు పరించింది.ఇదిలా వుంటే తాజాగా కేటీఆర్ తమపై బాబు, లోకేష్ చేసిన విమర్శలకి కౌంటర్ ఇచ్చారు.

అసలు ఎలాంటి తప్పు చేయకుంటే బాబు ఎందుకు భయపడుతున్నాడని, హైదరాబాద్ లో ఉంటున్న లోకేశ్వర్ అనే వ్యక్తి తన సమాచారం దొంగిలించడంపై చేసిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేస్తూ వుంటే ఎందుకు తప్పు పడుతున్నారని విమర్శించారు.కేవలం ఏపీ ప్రజల సానుభూతి కోసమే బాబు కేసీఆర్ మీద ఆరోపణలుచేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube