పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం రేపిన శ్రీధరణి హత్య కేసు మిస్టరీని పోలీసులు మొత్తానించి చేధించారు.బౌద్ధారామలకి వెళ్ళిన ప్రేమ జంటపై దాడి చేసిన దుండగులు ప్రియుడుని తీవ్రంగా కొట్టి, ప్రియురాలు శ్రీధరణి పై అత్యాచారం చేసి హత్య చేసారు.
అయితే అప్పటికే గుంటూరులో ఆ తరహా సంఘటన జరగడంతో ముందుగా శ్రీధరణి హత్య ప్రియుడే చేసి ఉంటాడని పోలీసులు భావించారు.అయితే ఊహించని విధంగా హత్య కేసులో దొరికిన ఆధారాల బాతి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఇన్వెస్టిగేషన్ ని వేరొక విధంగా తీసుకెళ్ళారు.
ఇక సంఘటన స్థలంలో దొరికిన ఆధారాల బట్టి ముందుగా రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన పద్ధతిలో విచారణ చేసే సరికి ఈ అత్యాచారం, హత్యలో భాగస్వామ్యం వున్న మిగిలిన ఇద్దరు నిందితులు తుపాకుల సోమయ్య, గంగయ్యలని అదుపులోకి తీసుకొని విచారించారు.దీంతో నిందితులు శ్రీధరణిని తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.
ఇక నిందితులు ముగ్గురు ఇప్పటికే నేర చరిత్ర కలివి ఉన్నవారని, వీరిపై ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కేసులు వున్నారని, మొత్తం వీళ్ళు 32 నేరాలకి పాల్పడినట్లు పోలీసులు మీడియాతో తెలియజేసారు.