నందమూరి తారాక రామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్’ రెండు పార్ట్లు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ ఏకంగా 70 కోట్ల బిజినెస్ చేస్తే కనీసం 20 కోట్లు కూడా వచ్చిన పరిస్థితి లేదు.
ఇక రెండవ పార్ట్ గురించి మాట్లాడితే నందమూరి ఫ్యాన్స్ మరియు సినీవర్గాల వారు కూడా తలదించుకునే పరిస్థితి.స్టార్ హీరో మూవీకి ఇలాంటి స్థితి ఏంటీ అంటూ అంతా అవాక్కయ్యే అవకాశం ఉంది.
అంతటి దారుణ పరాజయం తర్వాత బాలయ్య అభిమానులను కలవాల్సి ఉన్నా మొహం చాటేశాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘ఎన్టీఆర్ మహానాయకుడు’ విడుదలకు ముందు బాలకృష్ణ తన అభిమానులను కలిసేందుకు డేట్ ఫిక్స్ చేశాడు.
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు చెందిన అభిమానులను రెండు మూడు విడుతలుగా కలవాలని భావించిన బాలకృష్ణ సినిమా దారుణమైన కలెక్షన్స్ను నమోదు చేసిన నేపథ్యంలో కలిసేందుకు ఆసక్తి చూపడం లేదు.ఎంత మాత్రం అభిమానులతో కలిసేందుకు ఆసక్తి చూపని బాలకృష్ణ ముందుగా అనుకున్న మీటింగ్ను క్యాన్సిల్ చేయించినట్లుగా సమాచారం అందుతోంది.
‘ఎన్టీఆర్’ సినిమా కలెక్షన్స్ గురించి మీడియాలో దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి.ఇలాంటి సమయంలో ఫ్యాన్స్ మీట్ పెడితే ఆ కలెక్షన్స్ గురించి, సినిమా ఫలితం గురించి మరింతగా వార్తలు వస్తాయి.అలా వస్తే బాలయ్య పరువు మాత్రమే కాకుండా నందమూరి ఫ్యాన్స్ పరువు కూడా పోతుంది.అందుకే అభిమానులతో మీటింగ్ను బాలయ్య రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.‘ఎన్టీఆర్’ గురించి మరోసారి మీడియాలో అస్సలు ప్రచారం వద్దని భావిస్తున్నారు.అందుకోసమే మీడియా దృష్టిని ఆకర్షించే ఎలాంటి పనులు పెట్టుకోవద్దని బాలయ్య భావిస్తున్నాడు.
మొత్తానికి బాలయ్య చాలా రకాలుగా ఎన్టీఆర్ బయోపిక్ వల్ల నష్టపోయినట్లుగా తెలుస్తోంది.