తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.మరో వైపు ఎమ్మెల్సీ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతుంది.
ఎలా అయిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు, పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చాటాలని తెలంగాణ కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నం చేస్తుంది.అసెంబ్లీ ఎన్నికలలో పోగొట్టుకున్న పరువుని మళ్ళీ సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది.
ఇలాంటి టైంలో ఆ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో రెడీ కావడానికి రెడీ అవుతున్నారు.
టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కి ఆకర్షితం అయిన ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు ఈ రోజు సాయంత్రం సిఎం కేసీఆర్ ని కలిసిన తర్వాత త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు మీడియాకి తెలియజేశారు.టీఆర్ఎస్ పార్టీతోనే గిరిజన ప్రజల అభివృద్ధి సాధ్యం అవుతుందని, అందుకే కేసీఆర్ నాయకత్వంలో పని చేయడానికి ఆసక్తి చూపిస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలియజేసారు.
.