దేశంలో ఉన్న ప్రముఖ యూనివర్సిటీలు, కాలేజీల్లో కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి తమకు కావల్సిన విద్యార్థులకు భారీగా జీతాలిచ్చి ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంటాయనే విషయం అందరికీ తెలిసిందే.అయితే కాలేజీని బట్టి క్యాంపస్ ప్లేస్మెంట్లకు వచ్చే కంపెనీలు వేరేగా ఉంటాయి.
ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఆయా కంపెనీలు కాలేజీలకు వెళ్లి అభ్యర్థులను సెలెక్ట్ చేసుకుంటూనే ఉంటాయి.తాజాగా పాట్నాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్లను నిర్వహించారు.అయితే ఆ ఇంటర్వ్యూల్లో ఓ విద్యార్థినికి ఏకంగా రూ.39.5 లక్షల భారీ వేతన ప్యాకేజ్ లభించింది.మరి అంతటి భారీ వేతనాన్ని పొందిన ఆ విద్యార్థిని ఎవరో తెలుసా.?
ఆమె పేరు మేథా కుమారి.పాట్నాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) స్టూడెంట్.అందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విద్యను మేథా కుమారి అభ్యసిస్తోంది.అయితే పేరుకు తగినట్టుగా మేథా కుమారి నిజంగా చదువుల్లో మేథావే.ఎందుకంటే నిట్లో తాజాగా నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూల్లో ఈమె పాల్గొంది.అందులో అడోబ్ అనే ఐటీ కంపెనీ నిర్వహించిన టెస్ట్ను ఈమె రాసింది.
అయితే ఆ టెస్ట్ను రాసిన వారిలో మేథా కుమారి ఒక్కతే పాస్ కావడం విశేషం.దీంతో కేవలం ఆమెకు మాత్రమే అడోబ్ కంపెనీ జాబ్ ఇచ్చింది.అది కూడా ఏడాదికి రూ.39.5 లక్షల ప్యాకేజీని ఆమెకు అందజేసింది.
ఈ క్రమంలోనే అడోబ్ సంస్థలో మేథా కుమారి జాయిన్ కానుంది.ఆ సంస్థలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంప్లిమెంటేషన్, కోడింగ్ విభాగ ఆఫీసర్గా మేథా కుమారి బాధ్యతలు నిర్వహించనుంది.అయితే ఈమె తరువాత మరికొందరికి కూడా పలు కంపెనీలు లక్షల్లో ప్యాకేజీలను అందించాయి.ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ పాట్నా నిట్కు చెందిన 5 మంది విద్యార్థులకు రూ.27.5 లక్షల వేతన ప్యాకేజ్ను ఇవ్వగా, హై రేడియస్ సంస్థ 49 మందికి రూ.7 లక్షల ప్యాకేజ్ను, ఇద్దరికి రూ.8 లక్షల ప్యాకేజీని ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి.అవును మరి, ప్రతిభ ఉంటే అలాంటి భారీ వేతనాలే అందుతాయి.
అందుకే తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లలకు మంచి విద్యను అందేలా చూస్తారు.దాంతో వారు ఇలాగే ఉన్నత స్థానాల్లో ఉంటారని ఆశ.! అంతే కదా.!l