ఏపీ లో ఎన్నికల నగారా కొద్ది రోజుల్లోనే మోగనున్న తరుణంలో ప్రధాన అధికార పార్టీలో చిత్ర విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి.ముందుగానే తేల్చేసిన స్థానాలలోని అభ్యర్ధులని ఒకటికి రెండు సార్లు ప్రకటించడం.
పెండింగ్ లో ఉన్న వారి లిస్టు నే పదేపదే బయటపెట్టడం.ఇప్పటికే వాటిపై కనీస స్పష్టత లేకపోవడం.
ఇలా టీడీపీలో గజిబిజి గందర గోళంగా ఉంది.అయితే అభ్యర్ధుల ప్రకటన కూడా లీకుల రూపంలో ఇవ్వడం ఈ సారి టీడీపీ సరికొత్త పంధాని ఫాలో అవుతోందా అనే సందేహాన్ని కలిగిస్తోంది.
అసలు ఎందుకు టీడీపీ ఈ తరహ పద్దతిని ఫాలో అవుతోందో ఆ పార్టీ నేతలకైనా తెలుసోలేదో గాని ఈ లీకులు మాత్రం నేతల్లో కన్ఫ్యూజన్ కలిగిస్తున్నాయని అంటున్నారు.
నెల రోజుల క్రిందటే నెల్లూరు ఎంపీ సీటు పరిధిలోని నియోజకవర్గాల గురించి అభ్యర్ధుల ప్రకటన అంటూ చంద్రబాబు
సమీక్ష చేశారు.ఈ సందర్భంగానే కొన్ని పేర్లని బయటకి వదిలారు.సర్వేపల్లి నుంచీ సోమి రెడ్డి , నెల్లూరు అర్బన్ నుంచి నారాయణ, నెల్లూరు ఎంపీ సీటు కోసం బొమ్మి రెడ్డి అంటూ లీకులు ఇచ్చారు.
అయితే అవి లీకులకి మాత్రమే పరిమితం అయ్యాయి.
అయితే ఇప్పుడు నెల్లూరు ఎంపీ సీటుకు అభ్యర్థి ఎంపిక ఇంకా పూర్తి కాలేదని ప్రచారం జరుగుతోంది.
ఆ స్థానం నుంచీ పోటీ చేయాలని ఒంగోలు మాజీ ఎంపీ మాగుంటని అడుగుతున్నారట.కాని ఆ స్థానం నుంచీ పోటీ చేసేందుకు ఆయన ససేమిరా అన్నారని తెలుస్తోంది.
ఇక గతంలోనే ప్రకటించిన సర్వేపల్లి, నెల్లూరు సీట్లని మళ్ళీ ఎదో కొత్తగా ప్రకటించినట్టుగా లీకులు ఇవ్వడం ఎందుకో అర్థం కాని పరిస్థితి.
ఇదిలాఉంటే నెల్లూరుకి సంభందించిన రూరల్ సీటుని ఆదాలకి కేటాయించినట్టుగా ప్రచారం జరుగుతోంది.కాని ఆదాల వైసేపీ వైపు చూస్తున్నట్టుగా ప్రచారం జరగడంతో టీడీపీ కి సరైన అభ్యర్ధి ఆ స్థానం నుంచీ లేరని తెలుస్తోంది.ఇక కోవూరు విషయానికి వస్తే శ్రీనివాసులు రెడ్డి కి సీటు ఖరారు అయినట్టుగా ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే ఈ ప్రచారాల వెనుకాల లీకుల పర్వం నడుస్తోందని.ఇలా లీకులు ఇచ్చి.మరో వైపు ఇదంతా మీడియా సృష్టి అని కొట్టి పారేస్తున్నారట.దాంతో టీడీపీలో నేతలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారని అంటున్నారు కీలక నేతలు.
ఎన్నికలు ముంగిట ఉన్న సమయంలో ఇదేమి ప్రయోగాలు అంటూ పెదవి విరుస్తున్నారట.మరి లీకులు టీడీపీకి ఎంతవరకు కలిసొస్తాయి అనేది వేచి చూడాల్సిందే.
.