ఏపీలో 5 మంది ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నిక!

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఐదు మంది ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎమ్మెల్యే కోటాలో టీడీపీ నుంచి నలుగురు, వైసీపీ నుంచి ఒక ఎమ్మెల్సీ అభ్యర్ధి నామినేషన్ వేసారు.

 Mla Quota Mlc Candidates Win Unanimous In Andhra Pradesh-TeluguStop.com

నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఐదు మంది ఏకగ్రీవంగా ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

టీడీపీ నుంచి ఎమ్మెల్సీలుగా యనమల, అశోక్ బాబు, బీటీ నాయుడు, రామారావు ఎన్నిక కాగా, వైసీపీ నుంచి జంగా కృష్ణమూర్తి ఎన్నికయ్యారు.

ఇక వారు అందరూ ఎమ్మెల్సీలుగా ఎన్నికయినట్లు ఎన్నికల సంఘం ద్రువీకరించడం విశేషం.ఇక ఎమ్మెల్సీలుగా విద్యార్ధి, ఉపాధ్యాయ, ఉద్యోగ విభాగాల వారీగా త్వరలో ఎన్నికలు జరుగుతాయని తెలుస్తుంది.

మరి ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube