కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది.అయితే బాలిక ఆత్మహత్యాయత్నం కారణంగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే ప్రొద్దుటూరు లో ఓ ప్రైవేట్ స్కూల్ లో పదో తరగతి చదువుతున్న అమ్మాయిపై ఇద్దరు సహా విద్యార్ధులు హాస్టల్ భవనంలో పైకి తీసుకెళ్ళి అత్యాచారం చేసారు.అయితే ఈ సంఘటన గురించి అమ్మాయి స్కూల్ యాజమాన్యంకి ఫిర్యాదు చేస్తే ఈ విషయం బయటకి చెప్పొద్దని చెబితే పరీక్షలలో ఫెయిల్ చేస్తామని బెదిరించినట్లు తెలుస్తుంది.
అయితే ఈ విషయంపై ఆందోళన చెందిన అమ్మాయి ఆత్మాహత్యాయత్నంకి ప్రయత్నించడంతో విషయం తల్లిదండ్రులకి తెలిసింది.దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలెట్టినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది.