ఓ వైపు భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని వుంది.ఇదే సమయంలో పాకిస్తాన్ భారత్ నుంచి శాంతిని కోరుకుంటూ తమకి యుద్ధ ఖైదిగా దొరికిన అభినందన్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతుంది.
ఇంతలో మరోసారి పాకిస్తాన్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలే విధంగా భద్రతా దళాలు ఆ దేశానికి షాక్ ఇచ్చాయి.పాకిస్తాన్ కి చెందిన ఓ గూడచారిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
పంజాబ్ లో ఫిరోజ్ పూర్ సమీపంలో పాకిస్తాన్ గూడచారిని అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు అతనిని ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తుంది.ఇండియాలో ఎంత కాలం నుంచి వున్నాడు, ఎందుకు వచ్చాడు, ఎక్కడ తిరిగాడు, ఎలాంటి సమాచారం తెలుసుకున్నాడు అనే విషయాలని కూపీ లాగుతున్నారు.
మరి తమ గూడచారి అరెస్ట్ పై పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.