బిగ్ బాస్ 2 విజేత కౌశల్ మరోసారి మీడియా ముందుకు వచ్చాడు.గత కొన్ని రోజులుగా కౌశల్ ఆర్మీకి చెందిన కొందరు కీలక వ్యక్తులు కౌశల్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నాడని, ఆయన ప్రైజ్ మనీని క్యాన్సర్ పేషంట్స్కు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇంకా పలు రకాల విమర్శలు చేస్తూ కౌశల్ను టార్గెట్ చేయడం జరిగింది.
దాంతో కౌశల్ ఈ విషయమై స్పందించేందుకు మీడియా ముందుకు వచ్చాడు.
భార్య నీలిమాతో కలిసి మీడియా సమావేశంను ఏర్పాటు చేసిన కౌశల్ మాట్లాడుతూ… తనను కావాలని కొందరు అగౌరవ పర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
నేను 20 ఏళ్లుగా కష్టపడి సాధించుకున్న ఇమేజ్ను నాశనం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.తాను ఎంతో కష్టపడి నలుగురికి సాయం చేయాలని ముందుకు వెళ్తుంటే కొందరు మాత్రం నేను చేస్తున్నది తప్పు అంటూ నన్ను పట్టుకుని లాగే ప్రయత్నాలు చేస్తున్నారు.
నేను హీరో అవ్వాలనేది నా భార్య నీలిమా కోరిక.ఆ కోరికతోనే తనకు క్యాన్సర్ ఉన్నా కూడా పట్టించుకోకుండా, చికిత్స తీసుకోకుండా నా వెంట తిరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.
క్యాన్సర్ తో బాధపడుతున్న నీలిమాను కూడా కొందరు టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారని, వారందరు కూడా ఒక విషయాన్ని గుర్తించాలి అదేంటీ అంటే నేను ప్రతి విషయంలో కూడా చాలా క్లీయర్ గా ఉన్నాను.ముఖ్యంగా కౌశల్ ఆర్మీ ఫౌండేషన్కు సంబంధించిన లెక్కలు అన్ని కూడా చాలా క్లీయర్గా ఉన్నాయి.ఎవరు వచ్చి అడిగినా క్లీయర్గా చెప్పేందుకు నేను సిద్దంగా ఉన్నాను.అంతే తప్ప ఎవరో తప్పుడు ఆరోపణలు చేసినంత మాత్రాన నన్ను అపార్థం చేసుకోవద్దని అభిమానులను కోరడం జరిగింది.
కౌశల్ అభిమానులు ఇప్పుడు ఎటువైపు ఉన్నారనేది చూడాలి.