అమెరికాలో విద్యార్ధి అరెస్ట్ మరో సారి కలకలం రేపింది.విద్యార్ధి అరెస్ట్ అంటేనే వీసాల కారణంగానేమో నని భారతీయులు చాలా ఆందోళనకి లోనవుతున్నారు.
అయితే ఈ తెలుగు విద్యార్ధి అరెస్ట్ అయ్యింది మాత్రం అక్రమ వీసావలన కాదని అందుకు వేరే కారణం ఉందని అంటున్నారు.ఆ వివరాలలోకి వెళ్తే.
అమెరికాలోని ఆల్బనీ ప్రాంతంలో ఉన్నసెయింట్ రోజ్ కాలేజీలో చదువుతున్న తెలుగు విద్యార్ధి విశ్వనాద్ ఆకుతోట తానూ చదువుకునే కాలీజీలో వివిధ పరిసరాల్లో ఉన్న కంప్యూటర్ లలో ఓ యూఎస్బీ డ్రైవ్ను పెట్టాడు.ఆ డ్రైవ్ ని పెట్టడం వలన కంప్యూటర్లలోని ఎలక్ట్రికల్ హార్డువేర్ లోకి వివిధ రకాల పవర్ సర్జెస్ వెళ్లడంతో కంప్యూటర్లు పనిచేయడం ఆగిపోయింది.అయితే
ఇలా చేయడం వలన ఆ కాలేజీకి సుమారు 35 లక్షలు నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.అయితే కాలేజీ వారి ఫిర్యాదు తో స్పందించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్ని ఫెడరల్ కోర్టుకి తరలించారు.స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్ళిన విశ్వనాద్ నేరం రుజువయితే గనుకా అతడికి సుమారు కోటి ఎనభై లక్షణ రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.