భారత్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ ఫైలట్ ని రిలీజ్ చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం చివరికి ఒప్పుకుంది.దౌత్యపరంగా పాకిస్తాన్ పై భారత్ తీసుకొచ్చిన ఒత్తిడితో ప్రపంచ దేశాలు పాకిస్తాన్ కి నేరుగా వార్నింగ్ ఇచ్చాయి.
వెంటనే కవ్వింపు చర్యలు ఆపేసి భారత్ కి సహకరించాలని ఆదేశించాయి.ఒక వేళ మాట వినకుంటే పరిణామాలు తరువాత తీవ్రంగా ఉంటాయని కూడా ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యదేశాలు హెచ్చరించాయి.
దీంతో పాకిస్తాన్ మొండి వైఖరిని వదిలి దిగిరాక తప్పలేదు.
పాకిస్తాన్ తన ఆధీనంలో వున్న సైనికుడు అభినందన్ ని అడ్డుపెట్టుకొని భారత్ ని ఇరుకున పెట్టాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో చివరికి అతనిని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి వీలుగా తమ ఆధీనంలో వున్నా భారత కమాండర్ అభినదన్ ని అప్పగిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా ప్రకటించాడు.అతనిని రేపు భారత్ కి అప్పగిస్తామని ఇమ్రాన్ ఖాన్ తన సందేశంలో చెప్పాడు.