అతిలోక సుందరి శ్రీదేవి మరణించి ఏడాదికి పైగా అయిన ఆమె చనిపోయింది అంటే ఇప్పటికి నమ్మలేని పరిస్థితి.ఆమె మరణం కేవలం తెలుగు ప్రేక్షకులనే కాకుండా యావత్ భారత్ అభిమానులని కంట తడి పెట్టించింది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ఆరంభించిన శ్రీదేవి తరువాత చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకొని, బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి.తరువాత నిర్మాత బోణీ కపూర్ ని పెళ్లి చేసుకొని భార్య భార్యగా, తల్లిగా తన కుమార్తెలు యుక్త వయసు వరకు సినిమా కెరియర్ ని వదిలేసింది.
తరువాత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి మరల తాను ఎంత గొప్ప నటినో అనే విషయం మళ్ళీ నిరూపించుకుంది.అయితే ఊహించని విధంగా ఆమె మరణం యావత్ భారతదేశాన్ని కదిలించింది.
ఇదిలా వుంటే శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఆమె జీవిత కథని తెరపై ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారు.దీనికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ప్రస్తుతం జరుగుతుంది.
ఇక ఈ బయోపిక్ లో శ్రీదేవి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ నటి మాధురీ దీక్షిత్ ని తీసుకోవాలని బోనీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.మరి శ్రీదేవి పాత్రకి మాధురీ ఎంత వరకు న్యాయం చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.