మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రామ్ చరణ్ నిర్మిస్తున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది.
ఇందులో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తూ వుండగా, ఇందులో బాలీవుడ్, సౌత్ ఇండియన్ స్టార్స్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.ఇక తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశం వుందని తెలుస్తుంది.
ఇదిలా వుంటే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎస్ వర్క్ ని దర్శకుడు సురేందర్ రెడ్డి ఇప్పటికే స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమా మెజారిటీ పార్ట్ కంప్లీట్ చేసిన దర్శకుడు ఎట్టి పరిస్థితిలో సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ చేయాలని లక్ష్యంతో ఉన్నాడని తెలుస్తుంది.
ఇప్పటి వరకు వచ్చిన అవుట్ పుట్ తో చిరంజీవి కూడా సంతృప్తిగా వుండటంతో మేగ్జిమం రీషూట్ లేకుండా సినిమాని పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తుంది.