శ్రీధరణి హత్య కేసులో నిందితుడు గురించి నమ్మలేని నిజాలు!

పశ్చిమ గోదావరి జిల్లాలో కామావరపు కోటలో బౌద్ధారామాలలో ప్రేమ జంటపై దాడిలో మృతి చెందిన శ్రీధరణి మర్డర్ మిస్టరీలో షాకింగ్ నిజాలని పోలీసులు గుర్తించారు.శ్రీధరణి మర్డర్ కేసులో రాజు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 Sridharani Murder Case In West Godavari Accused Raju A Serial Killer-TeluguStop.com

ఇక అతనిని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారించిన పోలీసులకి తాను ఎందుకు శ్రీధరణిని హత్య చేసింది అనే విషయం చెబుతూనే పోలీసులు విస్తుపోయే మరిన్ని నిజాలు బయటపెట్టాడు.

శ్రీధరణిని హత్య చేసిన రాజు ఓ కామపిశాచి అని, అతను దండుపాల్యం సినిమా చూసి ఓ రకమైన సైకోగా మారాడని పోలీసులు చెప్పుకొచ్చారు.

ఇప్పటి వరకు అతను 14 మంది అమ్మాయిల మీద అత్యాచారం చేసి, 4గురు అమ్మాయిలని హత్య చేసాడని చెప్పుకొచ్చారు.అతని కన్ను పడితే ఎవరైనా లొంగిపోవాల్సిందే అని, ఒక వేళ ఎదురుతిరిగితే చంపేయడం అలవాటుగా మారిపోయిందని పోలీసులు వెల్లడించారు.

జీడితోటలు కాపలా కాస్తూ, ఒంటరిగా వున్నవారిని రాజు టార్గెట్ చేస్తూ ఉంటాడని పోలీసులు వెల్లడించారు.ముందుగా బెదిరించి డబ్బులు దోచుకోవడం, నచ్చితే అత్యాచారానికి పాల్పడటం, ఎదురుతిరిగితే చంపేయడం రాజు అలవాటుగా చేసుకొని ఓ సైకోగా మారిపోయాడని పోలీసులు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube