విశాఖ జిల్లాలో ఒకప్పుడు టీడీపీ పార్టీలో కీలక నేతగా, మంత్రిగా పని చేసిన దాడి వీరభద్రరావు చాలా కాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి అందరికి తెలిసిందే.ఆ తరువాత అతను వైసీపీలో చేరిన కూడా అక్కడ ఎక్కువ కాలం ఇమడలేకపోయారు.
వైసీపీ నుంచి బయటకి వచ్చిన జగన్ మీద విమర్శలు కూడా చేసారు.ఈ నేపధ్యంలో ఆ మధ్య కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాడి వీరభద్రరావుని మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.
అయితే తన నిర్ణయం తరువాత వెల్లడిస్తా అని దాడి, పవన్ తో స్పష్టం చేసారు.
ఇదిలా వుంటే ఎన్నికలు సమీపించడంతో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్న దాడి వీరభద్రరావు రాజకీయంగా యాక్టివ్ అయ్యి ఏదో ఒక పార్టీలో చేరాలని ఆలోచనలో వున్నారు.
ఇప్పటికే అతనికి వైసీపీలో చేరాల్సిందిగా పిలుపు వచ్చిందని దాడి మీడియాతో తెలియజేసారు.అయితే మార్చి నాటికి తాను ఎ పార్టీలో చేరబోయేది నిర్ణయం తీసుకొని చెబుతా అని స్పష్టం చేసారు.
ఈ నేపధ్యంలో అతను వైసీపీలో చేరుతారా లేదా జనసేనలో చేరుతారా అనేది ఇప్పుడు విశాఖ జిల్లాలో ఆసక్తికరంగా మారింది.