మేజర్ గా వస్తున్నఅడవి శేష్! రియల్ స్టొరీ కథతో!

గూడచారి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అడవి శేష్ హీరోగా మరో ఇంటరెస్టింగ్ కథతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

 Adavi Sesh Announce New Movie Based On Real Story-TeluguStop.com

ఇండియాలో ముంబాయ్ ఉగ్రదాడిలో టెర్రరిస్ట్ లతో వీరోచితంగా పోరాడిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ అనే ఆర్మీ ఆఫీసర్ నిజ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఇదిలా వుంటే మొదటి సారి ఈ సినిమాతో సోనీ పిక్చర్స్ సంస్థ టాలీవుడ్ లో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుంది.ఇక ఇందులో హీరో అడవి శేష్ టైటిల్ రోల్ పోషిస్తూ వున్నాడు.

ఇక ఈ సినిమాని తెలుగు, హిందీ భాషలలో ఏక కాలంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే అడవి శేష్ ఈ సినిమా గూడచారి సీక్వెల్ లో భాగంగా తీసుకోస్తున్నాడా, లేక సపరేట్ సినిమాగా వస్తుందా అనేది వేచి చూడాలి.

ఏది ఏమైనా మరోసారి అడవి శేష్ ప్రేక్షకుల ముందుకి మరో ఇంటరెస్టింగ్ పాయింట్ తో వస్తున్నాడని తాజాగా ఈ సినిమా పోస్టర్ బట్టి అర్ధమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube