కోదాడ చెరువులో నలుగురు విద్యార్ధులు గల్లంతు!

సూర్యాపేట సమీపంలో కోదాడ పెద్ద చెరువులో ఈతకి వెళ్ళిన నలుగురు విద్యార్ధులు ప్రమాదవశాత్తు చెరువులోకి జారిపడి గల్లంతయ్యారు.నలుగురు విద్యార్ధులు ఇంజనీరింగ్ చదువుతున్నట్లు తెలుస్తుంది.

 Four Students Dropped In A Kodad Pond-TeluguStop.com

సమీపంలో చెరువు వద్దకి వెళ్ళిన విద్యార్ధులలో ముందుగా సమీర్ చెరువులో దిగిన తర్వాత ప్రమాదానికి గురి కావడంతో అతనితో వచ్చిన ముగ్గురు విద్యార్ధులు ప్రవీణ్, మహిధర్ తో మరో విద్యార్ధి భవానీ ప్రసాద్ లు కాపాడే ప్రయత్నం చేశారు.

దీంతో వాళ్ళు కూడా చెరువులో ఈత కొట్టలేని పరిస్థితిలో నలుగురు గల్లంతయినట్లు తెలుస్తుంది.

ఇక సంఘటన గురించి తెలిసిన స్థానికులు పెద్ద చెరువు దగ్గరకి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.చనిపోయిన వారి మృతదేహాల్ని బయతని తీసే ప్రయత్నం పోలీసులు స్థానికుల సాయంతో చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరి ఆ విద్యార్ధులు ఎ గ్రామానికి చెందిన వారు అనే విషయం తెలియాల్సి వుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube