మహర్షి సినిమా రష్ చూసిన సూపర్ స్టార్ మహేశ్ బాబు మళ్ళీ కొన్ని సీన్స్ రీషూట్ చేయాలని దర్శకుడుకి చెప్పినట్లు, మహేశ్ బాబు అవుట్ మీద అంత సంతృప్తిగా ఉన్నాడని గాసిప్స్ వినిపించాయి.అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తాజాగా చిత్ర నిర్మాత దిల్ రాజు అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
మహర్షి సినిమాపై వస్తున్నా వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చేసారు.
ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం మార్చి 15 నాటికి టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
ఇంకా సినిమాలో రెండు పాటలు మాత్రమె చిత్రీకరించాల్సి ఉంటుందని కూడా తేల్చేసారు.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని, ముందుగా ప్రకటించినట్లే ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
తాజాగా చిత్ర నిర్మాతలు ఇచ్చిన అప్డేట్ తో మహర్షి సినిమాపై వున్న అన్ని అనుమానాలకి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.