తుపాకీ మాది, బుల్లెట్ మాదే.. కానీ మిమ్మల్ని చంపేది మాత్రం..! యాంకర్ రష్మీ ఆసక్తికర ట్వీట్.!

జమ్ము, కశ్మీర్‌లోని భారత జవాన్లపై పుల్వామా ఉగ్రదాడికి భారత సేనలు ప్రతీకారం తీర్చుకొన్నాయి.పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో టెర్రరిస్ట్ స్థావరాలపై మిరాజ్ యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్ తరహా దాడులకి పాల్పడింది.

 Anchor Reshmi Tweet On Indian Air Force Iaf Strikes-TeluguStop.com

ఈ దాడిలో సుమారు మూడు వందల మంది టెర్రరిస్ట్ లు మరణించినట్టు భారత రక్షణ శాఖ ప్రకటించింది.ఈ ఘటన పై సెలెబ్రిటీలు ట్విట్టర్ లో హర్షం వ్యక్తం చేసారు.

ట్విట్టర్ లో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే యాంకర్ రష్మీ కూడా తన స్టైల్ లో ట్వీట్ చేసారు.పుల్వామా దాడి తర్వాత దేశం మొత్తం భావోద్రేకంలో మునిగిపోయింది.

ఆ సమయంలో రష్మీ విషాద ఘటనపై తన సందేశాన్ని, సంతాపాన్ని సైనికుల కుటుంబాలకు వ్యక్తం చేసింది.భారత వాయు సేనల సర్జికల్ స్ట్రయిక్స్‌ గురించి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఓ పాత హిందీ సినిమాలోని హీరో రాజ్‌కుమార్ డైలాగ్‌ను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది.

నాకు ఈ రోజు హీరో రాజ్‌కుమార్ కొట్టిన ఫేమస్ డైలాగ్ గుర్తుకు వస్తున్నది అని ట్విట్టర్‌లో తెలిపింది.

మేము మిమ్మల్ని చంపడం ఖాయం.తప్పకుండా మిమ్మల్ని చంపుతాం.కానీ మేము చంపే తుపాకి కూడా మాదే.

బుల్లెట్ కూడా మాదే ఉంటుంది.చంపబోయే సమయం కూడా మాదే అవుతుంది.

కానీ ఒక్కటే తేడా మేము మిమ్మల్ని చంపే భూమి మాత్రం మీదే అవుతుంది అనే డైలాగ్‌ను నెటిజన్లతో పంచుకొన్నది.

అయితే ఈ ట్వీట్ కి ఓ నెటిజెన్ నెగటివ్ గా రీట్వీట్ చేయడంతో రష్మీ…సాలే.నువ్వు ఇక్కడ ఎందుకురా.పాకిస్థాన్‌కు వెళ్లురా అని ఘాటుగా బదులిచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube