భార్య భర్తల మద్య గొడవలు అనేవి చాలా కామన్.అయితే కొన్ని గొడవలు మరీ సీరియస్ అవుతూ ఉంటాయి.
ఆ గొడవల కారణంగా ఇద్దరి మద్య దూరం మరింతగా పెరుగుతుంది.కొన్ని గొడవలు మాత్రం భార్య భర్తలు విడిపోయే స్థితికి చేరుతోంది.
తాజాగా బంగ్లాదేశ్లో మాత్రం ఒక భర్త తన భార్యపై కోపంతో ఏకంగా విమానంను హైజాక్ చేసేందుకు ప్రయత్నించి ప్రాణాలను కోల్పోయాడు.గొడవ పడ్డ ఆ భర్త పిచ్చివాడిలా ప్రవర్తించడంతో పోలీసులు కాల్చి పారేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే…
భార్యతో గొడవ పడ్డ భర్త బంగ్లాదేశ్ ఢాకా నుండి దుబాయికి విమానంలో బయలుజేరాడు.అప్పటికే అతడు చాలా చిరాకుతో ఉన్నాడు.అలాంటి సమయంలో అతడికి ఒక ఐడియా వచ్చింది.విమానం టేకాఫ్ అయిన కొద్ది సమయానికే లేచి హడావుడి చేశాడు.తాను విమానంను హైజాక్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు.తన వద్ద బాంబులు, గన్ ఉందని కాక్పిట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు.
అతడిని సిబ్బంది హెచ్చరించే ప్రయత్నం చేశారు.కాని అతడు మాత్రం ఇష్టం వచ్చినట్లుగా తోటి ప్యాసింజర్లను కొట్టడం చేశాడు.
బాంబులతో బెదిరించే ప్రయత్నాలు చేశాడు.
తాను వెంటనే బంగ్లాదేశ్ ప్రధాన మంత్రితో మాట్లాడాలని, ఆమెతో కలిసి తన భార్య గురించి ఫిర్యాదు చేయాలంటూ హడావుడి చేశాడు.తన పట్ల భార్య తీరును పీఎంకు వివరిస్తానంటూ చెప్పాడు.విమాన సిబ్బంది హైజాక్ అయిన విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో వెంటనే విమానంను చిట్టగ్యాంగ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయడం జరిగింది.
అక్కడ హైజాకర్తో చర్చలు జరిపారు.
అయితే అతడు మాత్రం ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాతో మాట్లాడాల్సిందే అంటూ పట్టుబట్టాడు.తన వద్ద ఉన్న బాంబులతో ప్రయాణికులను మరియు సిబ్బందిని పేల్చి వేస్తానంటూ హెచ్చరించాడు.ఎంతగా ఒప్పించే ప్రయత్నం చేసినా కూడా అతడు ఒప్పుకోక పోవడంతో భద్రతా బలగాలు అతడిపైకి కాల్పులు జరిపారు.
దాంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.తీరా చూస్తే అతడి వద్ద బాంబులు కాని, తుపాకీ కాని లేదని వెళ్లడయ్యింది.